అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త చరిత్ర 

అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త చరిత్ర 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌‌‌లో ఈటల గెలుపు రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొత్త చరిత్రకు ప్రారంభం అని బీజేపీ నాయకురాలు విజయ శాంతి అన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఈటలను ఓడించలేకపోయా రన్నారు. పార్టీ నుంచి ఈటలను బయటకు పంపించడంలో కేసీఆర్ విజయం సాధించారని, ప్రజల హృదయాల నుంచి మాత్రం తప్పించలేకపోయారని విమర్శించారు. ఈటల గెలుపుతో టీఆర్ఎస్ ప్రతీకార రాజకీయాలకు ఓటమి తప్పలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, డబ్బు పంపిణీ ఈ ఎన్నికల్లో ఓడిపోయాయన్నారు. ఈటల గెలుపునకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు.