
హైదరాబాద్, వెలుగు : ధరణిలో సమస్యల పరిష్కారానికి కొత్త మాడ్యుల్స్ తో పాటు అవసరమైన మెకానిజాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. స్టాంప్ డ్యూటీని ధరణి పోర్టల్ లోనే అడ్జస్ట్మెంట్ చేసేలా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఏజీపీఏ, ఎస్పీఏ వంటివి అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈమేరకు టీఎస్ మేనేజింగ్ డైరెక్టర్, కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.