రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. మంగళవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లోనూ ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దిగ్గజ ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఎవరూ వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వరుస ఓటములపై జట్టు సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు.
ఓటమికి గల కారణాలను జట్టు లోని సభ్యులందరమూ చర్చిస్తామని, జట్టులో సమానత్వం కోసం ఏ చర్యలైనా తీసుకుంటామని, జట్టులో మార్పులు చేసి కొత్త వారికి అవకాశమిస్తానన్నాడు. కోహ్లీ. ప్రతి మ్యాచ్ కీలకమైనదే, కాబట్టి జట్టులో మార్పులు తప్పకపోవచ్చన్నాడు. జట్టు సభ్యులంతా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలని సభ్యులకు సూచించాడు. మనకు ఇంకా పది మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మన మీద మనం నమ్మకం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్లో మేము బాగానే ఆడాము కాని కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు.