హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు ఫైనల్ అయ్యాయి. బిడ్లలో షాపూర్జీ పల్లొంజీ సంస్థ ఎల్ –1గా నిలిచి పనుల టెండర్ను చేజిక్కించుకున్నట్లు తెలిసింది. సర్కార్ రూ.500 కోట్లకు టెండర్లు పిలవగా షాపూర్జీ పల్లొంజీ, ఎ అండ్ టీ సంస్థలు మాత్రమే బిడ్లు వేశాయి. ఇందులో ఎల్ అండ్ టీ కోట్ చేసిన దానికంటే షాపూర్జీ పల్లొంజీ సంస్థ కొంత తక్కువ మొత్తానికి కోట్చేసినట్లు సమాచారం. దీంతో నిర్మాణ పనుల టెండర్ పల్లోంజీ గ్రూప్కే దక్కాయి. అయితే ఈ సంస్థ కోట్ చేసిన మొత్తం కూడా సర్కార్ నిర్ణయించిన దానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తెలిసింది. టెండర్లు ఖరారవడంతో సర్కార్.. షాపూర్జీ సంస్థ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. దీన్ని గురువారం అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉంది. 12 నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేయాలని సర్కార్ రూల్ పెట్టింది. దీనికి సంబంధించి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. షాపూర్జీ పల్లొంజీ సంస్థ ఇప్పటికే ప్రగతి భవన్ను నిర్మించగా, పోలీస్ టవర్స్ నిర్మాణ పనులు చేస్తోంది.
For More News..