బోరు కొడితే బీరు.. బాధ పడితే బ్రాందీ.. సంక్రాంతికి కిక్కివ్వనున్న నాగార్జున

బోరు కొడితే బీరు.. బాధ పడితే బ్రాందీ.. సంక్రాంతికి కిక్కివ్వనున్న నాగార్జున

నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’. ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లన్ హీరోయిన్స్‌‌‌‌గా నటించారు.  విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, శనివారం మరో పాటను విడుదల చేశారు. ‘ఏం సేయ్యాలి సెప్పు.. సీసా మూత ఇప్పు’ అంటూ సాగిన పాటలో నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ మందు తాగుతూ  తాగు బోతులుగా కనిపించారు.

ఆస్కార్ అవార్డ్ విన్నర్స్ కీరవాణి కంపోజ్ చేసిన పాటకు ‘బోరు కొడితే బీరు కొట్టు, బాధ పడితే బ్రాందీ కొట్టు, విసుగు పుడితే విస్కీ  కొట్టు., మూడంతా పాడైపోతే పై మూడు కలిపి కొట్టు’ అంటూ చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ రాశారు.     మల్లికార్జున్, రేవంత్, సాయిచరణ్, లోకేష్, హైమత్,  అరుణ్ కౌండియా కలసి ఈ పాటని హుషారుగా పాడారు.  నాగార్జున డ్యాన్స్ మూమెంట్స్ మాస్‌‌‌‌ని ఆకట్టుకుంటున్నాయి.