తెలంగాణలో కొత్తగా 1,196 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,196 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,196 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,53,651 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి అయిదుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,390కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,745 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,34,234గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,027 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 15,205 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 44,635 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 47,29,401 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 92.34 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 192, రంగారెడ్డి 121, మేడ్చల్ 101, నల్గొండ 89, భద్రాద్రి 81, కరీంనగర్ 73, వరంగల్ అర్బన్ 51, ఖమ్మం 42 కేసులు నమోదైనట్లు రోగ్యశాఖ తెలిపింది.

For More News..

బీహార్‌లో మోడీ పాపులారిటీతోనే ఎన్డీఏ సక్సెస్

హద్దుల్లో ‘ఆన్‌‌లైన్‌‌’ డేటింగ్.. నచ్చితే కంటిన్యూ.. లేకపోతే బ్రేకప్

నూట రెండేళ్ల మాష్టారు.. 70 ఏళ్లుగా పాఠాలు చెప్తున్న నందా సర్

2021 సెలవుల లిస్ట్ వచ్చేసింది..