రాష్ట్రంలో కొత్తగా 1,446 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,446 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,446 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,16,238 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 8మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1241కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,918 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,91,269గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,728 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 19,413 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 40,056 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 36,64,152 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా మరియు రికవరీ రేటు 88.45 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 252, రంగారెడ్డి 135, మేడ్చల్ 131, కరీంనగర్ 74, భద్రాద్రి 59, నల్గొండ 58, ఖమ్మం 52, సంగారెడ్డి 50 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

రిలయన్స్ నుంచి స్మార్ట్​ కరెంట్​ మీటర్లు

ఆధార్​ పీవీసీ కార్డులో ఎన్నో ఫీచర్లు.. రూ.50 చెల్లిస్తే కార్డు ఇంటికే..

40 ఏళ్లకే బిలినియర్లుగా మనవాళ్లు