రాష్ట్రంలో మరో 1,554 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 1,554 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,554 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,19,224 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి 7గురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1256కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,435 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,94,653గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,203 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 19,251 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. గురువారం 43,916 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 37,46,963 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా మరియు రికవరీ రేటు 88.79 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 249, రంగారెడ్డి 128, మేడ్చల్ 118, భద్రాద్రి 95, ఖమ్మం 88, కరీంనగర్ 84, నల్గొండ 79, వరంగల్ అర్బన్ 53, సిద్ధిపేట్ 49, సూర్యపేట 42 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

వర్క్ ఫ్రం హోమ్ ఒక సవాలే

మోడీ రూ. లక్ష పెట్టి కొన్న ప్లాట్ ఇప్పుడు కోటి దాటింది

బీ కేర్‌ఫుల్.. వరద నీటితో రోగాల ముప్పు