తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,891 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,08,535 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి 7 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1208కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,878 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,80,953గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,374 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 21,801 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. గురువారం 53,086 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 34,49,925 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా మరియు రికవరీ రేటు 86.77 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 285, మేడ్చల్ 195, రంగారెడ్డి 175, నల్గొండ 128, కరీంనగర్ 97, వరంగల్ అర్బన్ 76, ఖమ్మం 72, సిద్ధిపేట్ 64, భద్రాద్రి 65 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

టీఆర్పీ రేటింగ్ కోసం ఇంటికి రూ.500 ఇస్తున్న టీవీ చానల్

ఆస్తుల ఆన్​లైన్‌లో​ సర్వర్​ డౌన్​.. ఆసక్తి చూపని ఓనర్లు

వీడియో: కేబుల్ బ్రిడ్జిపై షర్ట్ విప్పి సెల్ఫీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు