రాష్ట్రంలో మరో 1,896 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 1,896 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,896 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,06,644 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి 12 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1201కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,067 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,79,075గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,368 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 21,724 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. బుధవారం 50,367 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 33,96,839 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా మరియు రికవరీ రేటు 86.65 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 294, రంగారెడ్డి 211, మేడ్చల్ 154, నల్గొండ 126, సిద్ధిపేట్ 100, కరీంనగర్ 97, భద్రాద్రి 82, ఖమ్మం 79, సూర్యపేట్ 57, మహబూబాబాద్ 55, నిజామాబాద్ 49, వరంగల్ అర్బన్ 48 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

డబుల్ ఇల్లు ఇయ్యలేదని మంత్రి ఎదుట యువకుడి సూసైడ్ అటెంప్ట్

ఎన్నికలు వేరు.. ఉద్యమాలు వేరు..

‘గాంధీ’లో రెండు నెలలుగా జీతాల్లేవ్‌‌