తెలంగాణలో కొత్తగా 2,176 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,176 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,176 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,79,246 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి 8 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1070కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,004 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,48,139గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 23,929 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. బుధవారం 55,318 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 26,84,215 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా మరియు రికవరీ రేటు 81.42 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 308, రంగారెడ్డి 168, మేడ్చల్ 151, నల్గొండ 136, కరీంనగర్ 120, సిద్ధిపేట్ 95, భద్రాద్రి 88, ఖమ్మం 86, సూర్యపేట్ 82, వరంగల్ అర్బన్ 77, మహబూబా బాద్ 68, నిజామాబాద్ 68, సంగారెడ్డి 67, సిరిసిల్ల 56 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

టీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువు.. పోటీకే వెనుకాడుతున్న పల్లా, బొంతు

గ్రేటర్‌‌లో బీజేపీ దూకుడు.. టార్గెట్‌‌ 70 సీట్లు

రాజ్​భవన్​ మహిళలకు ఉపాధి శిక్షణ ప్రారంభించిన గవర్నర్