తెలంగాణలో మరో 2,479 కరోనా కేసులు.. 10 మంది మృతి

తెలంగాణలో మరో 2,479 కరోనా కేసులు.. 10 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,479 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,47,642 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 916కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,485 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,15,072గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. మరో 24,741 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 53,842 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మంగళవారం 62,649 టెస్టులు చేయగా.. ఇప్పటివరకు 18,90,554 కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 322, రంగారెడ్డి 188, మేడ్చల్ 183, కరీంనగర్ 120, ఖమ్మం 94, నల్గొండ 108, నిజామాబాద్ 101, సూర్యపేట్ 96, భద్రాద్రి 95, వరంగల్ అర్బన్ 124, సిద్ధిపేట్ 88, కామారెడ్డి 94, సంగారెడ్డి 64, మహబూబా బాద్ 67, జగిత్యాల 79, పెద్దపల్లి 71, రాజన్న సిరిసిల్ల 67, మంచిర్యాల్ 67, నాగర్ కర్నూల్ 54 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

టీచర్ ఉద్యోగాన్ని వదిలి సినిమాల వైపు..