రాష్ట్రంలో మరో 2,579 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో మరో  2,579 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,579 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,08,670 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి 9 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 770కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,752 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 84,163గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,737 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 295, రంగారెడ్డి 186, ఖమ్మం 161, వరంగల్ అర్బన్ 143, నిజామాబాద్ 142, నల్గొండ 129, కరీంనగర్ 116, మేడ్చల్ 106, మంచిర్యాల 104, జగిత్యాల 98, సిద్ధిపేట 92, పెద్దపల్లి 85, భద్రాద్రి 83, మహబూబాబాద్ 81, సూర్యపేట 78, మహబూబ్ నగర్ 69, కామారెడ్డి 64, రాజన్న సిరిసిల్ల 59, వనపర్తి 56, నాగర్ కర్నూల్ 48, జోగులాంబ 47, యాదాద్రి 46, జనగామ 46 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

ఒక్క తప్పు.. టోర్నీనే దెబ్బతీస్తుంది

అదానీ చేతికి ముంబై ఎయిర్‌‌‌‌పోర్టు?

వరుసగా నాలుగో రోజూ దిగిన బంగారం రేట్లు