రాష్ట్రంలో మరో 2,932 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో మరో 2,932 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,392 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,45,163 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 906కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,346 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,12,587గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,670 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. మరో 24,579 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 304, రంగారెడ్డి 191, కరీంనగర్ 157, మేడ్చల్ 132, ఖమ్మం 116, నల్గొండ 105, నిజామాబాద్ 102, సూర్యపేట్ 101, భద్రాద్రి 95, వరంగల్ అర్బన్ 91, సిద్ధిపేట్ 89, కామారెడ్డి 86, సంగారెడ్డి 82, మహబూబా బాద్ 71, జగిత్యాల 64, పెద్దపల్లి 69, మంచిర్యాల్ 69 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి

కరోనాకు భయపడి.. పిల్లలకు టీకాలు ఏపిస్తలే

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు కట్టినోళ్లంతా పాస్!