తెలంగాణలో కొత్తగా 921 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 921 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 921 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,65,049 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,437కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,097 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,52,565గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,047 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 8,720 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. సోమవారం 42,740 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 52,01,214 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 95.28 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 146, మేడ్చల్ 81, భద్రాది 71, రంగారెడ్డి 61, జగిత్యాల 50, నల్గొండ 49, వరంగల్ అర్బన్ 45, కరీంనగర్ 44, ఖమ్మం 36, సూర్యపేట 31 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

వంద మిలియన్ల ఫాలోవర్లను సాధించిన మొట్టమొదటి టిక్‌టాక్ స్టార్