రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 993 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,66,042 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,441కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,150 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,53,715గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,886 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 8,594 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 47,593 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 52,48,807 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 95.36 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 161, మేడ్చల్ 93, భద్రాది 67, రంగారెడ్డి 62, ఖమ్మం 57, కరీంనగర్ 46, నల్గొండ 45, వరంగల్ అర్బన్ 39, జగిత్యాల 39 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ వైరల్ మెసెజ్

బిజీగా ఉన్న మార్కెట్‌లో బాంబు దాడి.. 17 మంది మృతి

అయోధ్య ఎయిర్‌పోర్టు పేరు మార్పు!