- మీటింగ్ రీషెడ్యూల్ చేసిన లోక్సభ సెక్రటేరియెట్
న్యూఢిల్లీ : డబ్బులు తీసుకొని ప్రశ్నలడిగారనే ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను విచారిస్తున్న లోక్సభ ఎథిక్స్కమిటీ తరువాతి మీటింగ్ రీషెడ్యూల్ అయింది. ఈ మేరకు 7న(మంగళవారం) జరగాల్సిన మీటింగ్ను ఈ నెల 9న నిర్వహించనున్నట్లు లోక్సభ సెక్రటేరియెట్ నోటీసు జారీ చేసింది. రీషెడ్యూల్ చేయడానికి అధికారికంగా కారణా లు వెల్లడించలేదు.
అయితే ఈ నెల 2న జరిగిన విచారణకు సంబంధించిన ముసాయిదా నివేదికను ఆమోదించేందుకు ఈ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు నోటీసులో పేర్కొంది. ముసాయిదా నివేదికను ఆమోదించడం అంటే ఎథిక్స్ కమిటీ తన విచారణను ఇప్పటికే ముగించిందని అర్థం. 9న నిర్వహించనున్న మీటింగ్లో గత విచారణలో ప్యానెల్ సభ్యులు వెల్లడించిన అభిప్రాయలను నమోదు చేసి నివేదికను లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు పంపిస్తారు. కాగా, కమిటీలోని మెజారిటీ బీజేపీ మెంబర్లు మొయిత్రాకు వ్యతిరేకంగా సిఫార్సు చేసే అవకాశం ఉంది.