నవీన్ హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన నిహారిక

నవీన్ హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన నిహారిక

రాష్ట్రంలో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో నిందితురాలు నిహారిక జైలు నుంచి విడుదల అయింది. ఈ కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న నిహారికకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిహారికా చర్లపల్లి జైలు నుంచి ఇవాళ ఉదయం విడుదల అయింది. 

ఫిబ్రవరి 6న నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు సహకరించిన అతని స్నేహితుడు హసన్, నిహారికను పోలీసులు అరెస్ట్ చేశారు.  హత్య జరిగిన విషయాన్ని దాచి, హత్యకు సహకరించినందుకు గానూ నిహారికను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని హయత్ నగర్ కోర్ట్ లో హాజరు పరుచగా న్యాయ మూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అయితే, ఇటీవల బెయిల్ కోసం నిహారిక దరకాస్తు చేసుకోగా.. శనివారం ఆమెకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 

నిహారిక కోసమే హరిహరకృష్ణ హైదరాబాద్, అబ్దుల్లాపూర్ మెట్ వద్ద నవీన్ ని హత్య చేశాడు. తర్వాత నవీన్ శరీరాన్ని ముక్కలుగా కోసి గుండె, ఇతర శరీర భాగాలను ఫొటో తీసి నిహారికకు వాట్సాప్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు.