ఆ అమ్మవారు ఏడాదిలో ఐదుగంటలే దర్శనమిస్తారు

ఆ అమ్మవారు ఏడాదిలో ఐదుగంటలే దర్శనమిస్తారు

దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాల్లో...కొన్ని రహస్యాలు, కొన్ని అద్భుతాలు, మరికొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఛార్‌ధామ్‌ వంటి కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. కానీ.. ఛతీస్‌గఢ్‌లోని ఓ ఆలయంలో మాత్రం ఏడాదిలో కేవలం ఐదు గంటలు మాత్రమే గుడి  తలుపులు తెరుచుకుంటాయి. అదే సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు.

ఛతీస్‌గఢ్‌లోని నిరయ్‌ మాతా ఆలయాన్ని ఏడాదిలో కేవలం 5 గంటలే గంటలే తెరుస్తారు గుడి నిర్వాహకులు. సమయం తక్కువ ఉండడంతో ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. గరియాబంద్‌ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఈ గుడి ఉంది. ప్రతి ఏడాది ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉ.9 గంటల వరకే భక్తులకు దర్శనం కల్పిస్తారు.  తిరిగి వచ్చే ఏడాది ఛైత్ర నవరాత్రి వరకు ప్రవేశం ఉండదు.

ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. నవరాత్రుల ప్రారంభంలో ఆలయంలో దీపం దానంతట అదే వెలుగుతుందట.నూనె లేకున్నా..తొమ్మిది రోజుల పాటు దీపం  అఖండ జ్యోతిలా వెలుగుతూనే  ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. సాధారణంగా దేవాలయాల్లో అర్చనలకు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకరణలు లాంటి సామగ్రిని ఉపయోగించరు.  కేవలం కొబ్బరికాయ, అగరబత్తులతో మాత్రమే అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఐదు గంటలు దర్శన సమయం తర్వాత తిరిగి మరుసటి ఏడాది ఛైత్ర నవరాత్రి వచ్చేదాక ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధనలున్నాయి. అలాగే ఈ గుడిలోకి మహిళల ప్రవేశం నిషేధం ఉంది. ప్రవేశిస్తే చెడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్మకమట.