నిరంజన్ రెడ్డి వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి

నిరంజన్ రెడ్డి వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి

మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ అభ్యర్ధి రాంచంద్రారావు. న్యాయవాదులను కలిసి ఓట్లు అభ్యర్ధించారు. తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోనే లాయర్లకు కరోనా సాయంగా వందకోట్లు విడుదల చేశారని చెప్పారు రాంచంద్రారావు. లాక్ డౌన్ లో జూనియర్ అడ్వకేట్లకు పారితోషకం కోసం కౌన్సిల్ లో ప్రస్తావించానన్నారు. పీపీలకు సకాలంలో జీతాలు రావడంలేదని…ప్రభుత్వ ఉద్యోగులను బెందిరించేలా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. మంత్రి ఉద్యోగులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.