- కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, వెలుగు: జిల్లాలో గర్భిణులు, బాలింతలు, శిశువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అంకురం’ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించగా కలెక్టర్పాల్గొని మాట్లాడారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే వారిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి, వారిని సంరక్షించాలని సూచించారు.
ఎన్ఎంఆర్ను సింగిల్ డిజిట్కు పరిమితం చేయడమే అంకురం కార్యక్రమం లక్ష్యమన్నారు. గర్భిణులకు అవసరమైన అన్ని పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. కార్యక్రమ వాల్పోస్టర్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. డీఎంహెచ్వో రాజేందర్, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పర్యవేక్షకుడు గోపాల్ సింగ్, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
