నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : జైశ్రీరాం వడ్లకు ఆల్ టైం రికార్డు ధర దక్కింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో క్వింటాల్ వడ్లు రూ.4,455 పలికాయి. కేసముద్రం పరిసర ప్రాంతంలోని ఐదుగురు రైతులు గతేడాది సాగు చేసిన జైశ్రీరాం రకం వడ్లు 107 బస్తాలను మార్కెట్ కు తీసుకొచ్చారు. ఈ- నామ్ విధానంలో వేలం వేయగా.. క్వింటాల్ కు గరిష్టం రూ.4,455 ధర పలికాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
