
భారతీయ హస్తకళలకు మద్దతుగా..కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన స్వదేశ్ హస్తకళ దుకాణాన్ని బుధవారం ( నవంబర్ 8) ప్రారంభించారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ. జూబ్లీహిల్స్ లోని అల్కాజర్ మాల్ లో ఏర్పాటు చేసిన మొదటి స్వదేశీ హస్తకళా స్టోర్ ప్రారంభ కార్యక్రమంలో టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా, షటిల్ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ప్రముఖ నటి నమ్రతా శిరోద్కర్ పాల్గొన్నారు.
స్వదేశ్ స్టోర్లు దేశంలో శతాబ్దాల నాటి కళారూపాలు, సృజనాత్మక రూపకల్పనలు ద్వారా ప్రపంచానికి అందించడమే కాకుండా, కళాకారులు, చేతి వృత్తుల వారి గొప్పతనం ప్రపంచ వ్యాప్తం చేయడం, వారి స్థిరమైన జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయని నీతా అంబానీ అన్నారు.
జూబ్లీహిల్స్ లోని మొదటి స్వదేశీ స్టోర్ సుమారు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. చాలాకాలంగా మర్చిపోయిన నైపుణ్యత, స్థానిక వస్తువులను ఉపయోగించి దేశంలోని నైపుణ్యం, ప్రతిభావంతులైన కళాకారుల చేర పూర్తిగా చేతితో తయారు చేయబడిన క్యూరేటెడ్ ఉత్పత్తుల సేకరణలను ఈ స్టోర్ లో ప్రదర్శిస్తారు.
సందర్శకులు ఆహార ఉత్పత్తులు, దుస్తులు, హస్తకళల వంటి ఉత్పత్తులను బ్రౌజ్ చేయొచ్చు. స్కాన్ అండ్ నో టెక్నాలజీ ఫీచర్ ద్వారా ప్రతి ఉత్పత్తి , దాని తయారీదారు వంటి సమాచారం తెలుసుకోవచ్చు.
#WATCH | Nita Ambani, Founder and Chairperson, Reliance Foundation met Sania Mirza, PV Sindhu, Namrata Shirodkar and others at the launch of the first standalone Swadesh store at Alcazar Mall, Jubilee Hills, Hyderabad. pic.twitter.com/2drepDRIWy
— ANI (@ANI) November 8, 2023