
అనంత్ అంబానీ, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్ నగర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దేశం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు అటెండ్ అయ్యారు.
ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలో ఎంత మంది గొప్ప గొప్ప అతిధులున్నా? ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ(Nita Ambani)కి ఎవ్వరూ సాటిలేరు అనేలా ముస్తాబయింది.తన అలంకరణ మొదలు..తన హడావిడి వరకు ప్రతీది వావ్ అనేలా ఉంది.
అపర కుబేరుడు ముకేష్ అంబానీ భార్యగా.. రిలయన్స్ పౌండేషన్ చైర్ పర్సన్ హోదా లో..అనంత్ అంబానీ తల్లిగా నీతా అంబానీ ఈ ఈవెంట్ లో ఎంతో స్పెషల్ గా నిలిచింది.
అసలు విషయానికి వస్తే..మార్చి 3న జరిగిన వేడుకలో రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్తో కలిసి ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన చేనేత కాంచీపురం చీరను నీతా అంబానీ ధరించింది. ఈ చీరలో ఎంతో కలర్ ఫుల్ గా కనిపించిన నీతా అంబానీ అలంకరణలో..మరో స్పెషాలిటీ అందరి దృష్టిని ఆకర్షించింది.
అదేంటంటే..నీతా తన హోదాకి ఏమాత్రం తగ్గకుండా ఖరీదైన డైమండ్ నెక్లెస్ ధరించి..ఏకంగా ప్రపంచం మొత్తం ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది. తన మెడలో ఒక క్లాసీ పచ్చ డైమండ్ నెక్లెస్ ధగధగలాడిపోయింది. తన స్టడ్ చెవిపోగులు, బ్యాంగిల్స్ మరియు స్టేట్మెంట్ రింగ్తో చాలా చక్కగా కనిపిస్తోంది. అలాగే నీతా అంబానీ నెక్లెస్లోని పచ్చలు మరియు వజ్రాల పరిమాణం వాటి విలువ..అత్యంత విలువైన క్యారెట్లను సూచిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నీతా అంబానీ ధరించిన ఆ డైమండ్ నెక్లెస్ ఎంత అందంగా ఉందో అని కాకుండా..దాని ధర ఎంతో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డైమండ్ నెక్లెస్ ధర సుమారు రూ.400 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా.
ఈ మణిహారాన్ని నీతా ప్రీ వెడ్డింగ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది.కేవలం నెక్లెస్ ధరనే ఇంతంటే..మరి పెళ్లి ఖర్చు సుమారు రూ. 1000 కోట్లు అయింటుందేమో! ఏమో మరి కావొచ్చు.