పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ నిర్వహించాలి: నితేష్ వ్యాస్ 

పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ నిర్వహించాలి: నితేష్ వ్యాస్ 

మెదక్ టౌన్, కొండాపూర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ సూచించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆఫీసర్​వికాస్ రాజ్​తో కలిసి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన పోలింగ్ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సమావేశంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, మాధురి, డీఆర్​వో పద్మశ్రీ, సీపీవో  కృష్ణయ్య, డీఈవో రాధాకిషన్​, డీఆర్​డీఏ పీడీ శ్రీనివాస్, డీటీవో  చిన్న సాయిలు, ఏడీ గోవింద్, మెదక్​, నర్సాపూర్​ ఆర్డీవోలు అంబదాస్​ రాజేశ్వర్​,  శ్రీనివాస్ డీఎస్​వో రాజిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.