నిజాం కాలేజీలో విద్యార్థుల ధర్నా

నిజాం కాలేజీలో విద్యార్థుల ధర్నా

హైదరాబాద్ బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. హాస్టల్లో సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని.. తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపల్ భీమా నాయక్ ని అడిగితే అసభ్యకరంగా మాట్లాడుతున్నారని.. ప్రిన్సిపల్ అలా మాట్లాడితే మా సమస్యను ఎవరు పరిష్కరిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము పడుకోవడానికి బెడ్లు కూడా లేవని.. ఒక్క బెడ్ పై ముగ్గురు విద్యార్థులం పడుకుంటున్నామని వాపోయారు. హాస్టల్ లో సరైన వసతులు కల్పించే వరకు తరగతులకు హాజరుకామని డిమాండ్ చేశారు. వెంటనే ప్రిన్సిపల్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరారు.