
నిజామాబాద్, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించిన వడ్లు, బియ్యం వర్షానికి తడవకుండా మిల్లర్లు జాగ్రత్త వహించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సూచించారు. గురువారం ఆయన అర్సాపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ రైస్ మిల్స్ విజిట్ చేశారు. జిల్లాలో 90 శాతానికి మించి వడ్ల కొనుగోళ్లు ముగిశాయని ఇంకా కొనసాగుతున్న కొనుగోళ్లకు చెందిన ధాన్యం లోడ్లు ఎన్ని వస్తున్నాయి?
వాటిని ఎలా నిలువ చేస్తున్నారు? మిల్లింగ్ చేసిన రైస్ స్టాక్ను గమనించి సూచనలు చేశారు. వడ్లతో వచ్చిన లారీలను వెంటనే అన్లోడ్ చేయాలన్నారు. తరుగు అనే మాట ఎక్కడా వినబడడానికి వీలులేదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, డీఎస్వో అరవింద్రెడ్డి, డీఎం శ్రీకాంత్రెడ్డి తదితరులు ఉన్నారు.