వడ్లు, బియ్యం తడవకుండా చూడాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ

వడ్లు, బియ్యం తడవకుండా చూడాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ

నిజామాబాద్​, వెలుగు: కస్టమ్ మిల్లింగ్​ కోసం తరలించిన వడ్లు, బియ్యం వర్షానికి తడవకుండా మిల్లర్లు జాగ్రత్త  వహించాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు సూచించారు.  గురువారం ఆయన అర్సాపల్లి, ఖానాపూర్, సారంగాపూర్​ రైస్​ మిల్స్ విజిట్ చేశారు. జిల్లాలో 90 శాతానికి మించి వడ్ల కొనుగోళ్లు ముగిశాయని ఇంకా కొనసాగుతున్న కొనుగోళ్లకు చెందిన ధాన్యం లోడ్లు ఎన్ని వస్తున్నాయి? 

వాటిని ఎలా నిలువ చేస్తున్నారు? మిల్లింగ్​ చేసిన రైస్​ స్టాక్​ను గమనించి సూచనలు చేశారు. వడ్లతో వచ్చిన లారీలను వెంటనే అన్​లోడ్​ చేయాలన్నారు. తరుగు అనే మాట ఎక్కడా వినబడడానికి వీలులేదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్, డీఎస్​వో అరవింద్​రెడ్డి, డీఎం శ్రీకాంత్​రెడ్డి తదితరులు ఉన్నారు.