ఆర్టీసీ భూములు అమ్ముకునేందుకు కేసీఆర్ కుట్ర

ఆర్టీసీ భూములు అమ్ముకునేందుకు కేసీఆర్ కుట్ర

సీఎం కేసీఆర్ పై  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు.  ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి ప్రజల కోసం పని చెయ్యాలని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం మీడియాతో మాట్లాడిన అరవింద్..  6 ఏళ్ల నుంచి ఆర్టీసీ కోసం ప్రభుత్వ మెరుగు పరిచిన చర్యలేవి అంటూ ప్రశ్నించారు. ఆర్టీసీ భూములు అమ్ముకునేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ అండగా ఉంటుందని, ఆర్టీసీ సమ్మెపై కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వాతలు పెట్టడం ఖాయమని అరవింద్ అన్నారు.

ప్రధాని మోడీ దేశ ప్రజలకోసం రోజులో 18 గంటలు పని చేస్తున్నాడన్నారు. ప్రస్తుతం దేశంలో మోడీ గాలి వీస్తోందని.. ఆ గాలిలో గెలిచాం, గెలుస్తామన్నారు. కేటీఆర్, కేసీఆర్ ఆ గాలికి కొట్టుకపోవడం ఖాయమని అన్నారు ఎంపీ.

Nizamabad MP Dharmapuri Arvind Fire on CM KCR