కాంగ్రెస్ లో చేరిన నిజాంపేట మాజీ సర్పంచ్

కాంగ్రెస్ లో చేరిన నిజాంపేట మాజీ సర్పంచ్

హైదరాబాద్, వెలుగు: నిజాంపేట్ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ వడ్ల నగాచారి ఆ పార్టీని వీడి శనివారం కాంగ్రెస్ లో చేరారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ చార్జ్  కొలన్ హన్మంత రెడ్డి సమక్షంలో పార్టీ సీనియర్ నేత కొలన్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎంసీ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్  కండువా కప్పుకున్నారు. ఎన్ఎంసీ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.