నిజాంసాగర్ కు వరద ఉధృతి.. 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

నిజాంసాగర్ కు వరద ఉధృతి.. 17 గేట్లు ఎత్తి దిగువకు  నీటి విడుదల

ఎల్లారెడ్డి( నిజాంసాగర్​), వెలుగు : నిజాంసాగర్ ప్రాజెక్ట్​కు వరద ఉధృతి పెరిగింది. ఆదివారం ఇన్​ ప్లో 1,20,464 క్యూసెక్కులు ఉంది.  ప్రాజెక్ట్​17 గేట్లు ఎత్తి దిగువకు 1,25.562 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.  ప్రాజెక్ట్​నీటి మట్టం   1405 అడుగులు కాగా, 1401 అడుగుల నీటి మట్టం ఉంది.  17.8 టీఎంసీల నీటి సామర్థ్యానికి 13.17 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.