ఢిల్లీలో లాక్ డౌన్ కు అవకాశం లేదు: సత్యేందర్‌ జైన్

ఢిల్లీలో లాక్ డౌన్ కు అవకాశం లేదు: సత్యేందర్‌ జైన్

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మూడో దఫా గరిష్ట స్థాయిని దాటేసిందన్నారు ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్‌ జైన్.  అందుకే లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌కు సంబంధించి వదంతులను ఆయన కొట్టిపారేశారు. దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. మూడో దఫా గరిష్ట స్థాయిని ఢిల్లీ దాటేసిందని…దీపావళి పండుగ పూర్తికావడంతో మార్కెట్లలో రద్దీ కూడా తగ్గిపోనుందన్నారు. లాక్‌డౌన్‌ తో ఎంత ఉపయోగం ఉందో… మాస్కులు ధరించడం వల్ల అంతే ఉపయోగం ఉందని మనం నేర్చుకున్నామన్నారు. ప్రజలు నిబంధనలు అనుసరిస్తూ, మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు మంత్రి సత్యేందర్‌ జైన్.