టెట్ రిజల్ట్స్‌‌ 27న కష్టమే!

టెట్ రిజల్ట్స్‌‌ 27న కష్టమే!

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టీఈటీ) రిజల్ట్స్‌‌ ఈ నెల 27న రిలీజ్ అయ్యే అవకాశా లు కనిపించడం లేదు. ప్రాసెస్ ఇంకా కొనసాగుతుండటం తో రిజల్ట్స్‌‌ విడుదలకు మరింత టైమ్ పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టెట్ ఫైనల్ కీ అధికారికం గా రిలీజ్ చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతు న్నారు. ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించగా, పేపర్ 1కు 3,18,506 మంది, పేపర్ 2కు 2,51,070 మంది హాజరయ్యారు. ఈ నెల 27న ఫలితాలు విడుదల చేస్తామ ని అధికారులు ముందే ప్రకటించారు. దీంతో ఈ నెల15న ప్రైమరీ కీ విడుద ల చేశారు. ఇందులో పేపర్ 1లో 7,930, పేపర్ 2లో 4,663 అబ్జెక్షన్స్ వచ్చా యి. వీటిపై అధికారులు కసరత్తు చేసి, ఫైనల్ కీ విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటికీ ఆ పని చేయలే. దీంతో టెట్ ఆన్సర్లపై అందరిలో గందరగోళం నెలకొంది.