అవే పన్నులు కట్టండి.. ఉద్యోగులకు ఊరట లేదు..

అవే పన్నులు కట్టండి.. ఉద్యోగులకు ఊరట లేదు..

ఉద్యోగుల పన్నుల విధానంలో ఎలాంటి మార్పు లేదు.. అసలు పన్ను విధానంలోనే ఎలాంటి మార్పులు చేయలేదు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. గత ఏడాది ఉన్న విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. దిగుమతి, ఎగుమతి సుంకాల్లోనూ మార్పు లేదు.. ఉద్యోగులు, వ్యాపారులు కట్టే ఆదాయ పన్ను స్లాబుల్లోనూ మార్పు లేదు.. యధాతధంగా కొనసాగనున్నట్లు ప్రకటించారామె. 

గత బడ్జెట్ లో ప్రకటించిన విధంగా స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50 వేలు నుంచి 75 వేల రూపాయలకు పెంపు 2024 మార్చి నుంచి అమల్లోకి వస్తుందని.. కొత్తగా స్లాబ్ రేట్లను మార్చటం లేదని వెల్లడించారామె. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు చేయటం లేదని వెల్లడించారామె. అయినా కూడా ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరిగాయని.. ఇందుకు పన్ను చెల్లింపుదారులకు అభినందలు తెలిపారామె. కార్పొరేట్ ట్యాక్స్ 30 నుంచి 22 శాతానికి తగ్గింపు అనేది గత బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయం అని.. అది అమల్లోకి వస్తుందని.. కొత్తగా కార్పొరేట్ ట్యాక్సుల్లో మార్పులు చేయటం లేదని స్పష్టం చేశారామె.

ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని ఖరాఖండిగా స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్ కావడంతో ఆర్థిక మంత్రి కొత్త ప్రతిపాదనలు చేయకుండా శాఖలవారీ కేటాయింపులకే పరిమితమయ్యారు.