ఎమ్మెల్యేతో నా అనుబంధం చెడిపోయే పరిస్థితి ఏర్పడింది

ఎమ్మెల్యేతో నా అనుబంధం చెడిపోయే పరిస్థితి ఏర్పడింది
  • కార్యకర్తలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
  • ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 

జనగామ జిల్లా:  నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల్ల స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నాకు మధ్య ఉన్న అనుబంధం చెడిపోయే ప్రమాదం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నేను జనగామ సీటు ఆశిస్తున్నానానడం శుద్ధ అబద్ధమని స్పష్టం చేసిన ఆయన.. కార్యకర్తలు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. జనగామలో ఇవాళ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జనగామలో పోటీచేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చాలా అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.