నో మాస్క్: రూ.2వేలు ఫైన్

నో మాస్క్: రూ.2వేలు ఫైన్

తెలంగాణలో మళ్లీ  కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్‌‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మాస్కులు లేని వారికి పోలీసులు భారీ ఎత్తున జరిమానాలు వేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రూ.1000 ఫైన్ వేస్తున్నారు.ఒకవేళ మాస్కులు లేని కస్టమర్లను షాపులోకి అనుమతిస్తే రూ.2000 జరిమానా విధిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు..ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మాస్క్ ధరించక పోతే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.