థర్డ్ ఫ్రంట్​కు చాన్స్ లేదు..  విపక్షాలకు నవీన్​ ​పట్నాయక్​ ఝలక్​

థర్డ్ ఫ్రంట్​కు చాన్స్ లేదు..  విపక్షాలకు నవీన్​ ​పట్నాయక్​ ఝలక్​

న్యూఢిల్లీ: ఒడిశా సీఎం, బిజూ జనతా దళ్ (బీజేడీ) చీఫ్‌‌‌‌  నవీన్‌‌ పట్నాయక్‌‌ విపక్షాలకు షాక్‌‌ ఇచ్చారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో తన పార్టీ ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపబోదని, ఒంటరిగానే ముందుకు వెళ్తుందని ప్రకటించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను తమ స్టేట్​లోని అంతర్జాతీయ ఎయిర్​పోర్ట్​ గురించి మాట్లాడడానికి వచ్చానని తెలిపారు. ఎయిర్​పోర్ట్​ను భువనేశ్వర్ నుంచి పూరీకి మార్చడంపై చర్చించానని, సాధ్యమైన విధంగా సహాయం చేస్తానని ప్రధాని చెప్పారని అన్నారు. 2024 లోక్​సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘బీజేడీ విపక్షాలతో కలవదు” అని తెలిపారు.

తనకు తెలిసినంత వరకు ఇప్పట్లో థర్డ్‌‌ ఫ్రంట్‌‌ కు అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు బీహార్​ సీఎం నితీశ్​ కుమార్ చేస్తున్న ప్రయత్నాలకు నవీన్  ప్రకటన పెద్ద దెబ్బ కొట్టినట్లు అయింది.