
ముషీరాబాద్, వెలుగు: ట్యాంక్బండ్ వద్ద గణనాథుల నిమజ్జనానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని వీహెచ్పీ నేతలు, భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు మండిపడ్డారు. బుధవారం మండపాల నిర్వాహకులతో కలిసి ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను వారు పరిశీలించారు. హుస్సేన్ సాగర్లో వినాయకులను నిమజ్జనం చేశారు. అనంతరం భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్, సెంట్రల్ కమిటీ మెంబర్ ఆలె భాస్కర్ మాట్లాడుతూ.. ట్యాంక్బండ్ చుట్టూ సరిపడా క్రేన్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే తామే ఏర్పాట్లు చేసుకుంటామన్నారు.