రాహుల్, ప్రియాంక గాంధీ రేప్ ఘటనలను రాజకీయం చేస్తున్నారు

రాహుల్, ప్రియాంక గాంధీ రేప్ ఘటనలను రాజకీయం చేస్తున్నారు

ఢిల్లీ: రాజకీయ స్వార్థంతోనే రాహుల్, ప్రియాంక గాంధీ రేప్ ఘటనలు రాజకీయం చేస్తున్నారన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. పంజాబ్ లో ఆరేళ్ల బీహారీ దళిత చిన్నారిపై జరిగిన రేప్ పై కాంగ్రెస్ అన్నా చెల్లెల జంట ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎంపిక చేసుకున్న ఘటనలపై మాత్రమే మాట్లాడుతున్నారన్నారు.  ఈ కుటుంబానికి న్యాయం చేసేందుకు బీజేపీ అండగా నిలబడుతుందని.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోదరులపై గతంలో రేప్ కేసులు ఉన్నాయన్నారు.

అందుకే వారు ఈ ఘటనపై మాట్లాడటం లేదని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీడియాపై దాడులు జరుగుతున్నాయని..మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ ,వామపక్ష మేధావులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అధికారంలోకి వస్తే మేము ఏమి చేస్తామో మేనిఫెస్టోలో హక్కు ఉందని..ఆరోగ్యం రాష్ట్ర జాబితాలోని అంశమన్నారు  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.