SBIలో 2 వేల పీవో ఉద్యోగాలకు నోటిఫికేషన్

SBIలో 2 వేల పీవో ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2 వేల ప్రొబేషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు SBI నోటిఫికేషన్ లో తెలిపింది. ఇందులో జనరల్ కేటగిరీలో 810, OBCలకు 540, SCలకు 300, STలకు 150, EWS కేటగిరీలో 200 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 21 నుంచి 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ డిసెంబరు 4. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ప్రిలిమ్స్ పరీక్షలు డిసెంబరు 31 నుంచి 2021 జనవరి 5 వరకు జరగనున్నాయి.జనవరి మూడో వారంలో ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత జనవరి 29న మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి చివరి వారంలో మెయిన్స్ ఫలితాలు వస్తాయి. అదే నెలలో కానీ , మార్చి నెలలో కానీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పూర్తి వివరాలకు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లాగిన్ కావాల్సిందిగా సూచించింది.