
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. ఇన్నాళ్లు గ్రేటర్ హైదరాబాద్లోనే కేసులు ఎక్కువగా ఉండగా, ఇప్పుడు జిల్లాల్లోనూ నిత్యం పదుల సంఖ్యలో కేసులు వస్తున్నయి. గడిచిన పది రోజుల్లో 611 కేసులు జిల్లాల్లోనే నమోదైనయి. లాక్డౌన్ టైమ్లో కొన్ని జిల్లాలకే పరిమితమైన వైరస్, లాక్డౌన్ సడలింపుల తర్వాత అన్ని జిల్లాలకూ విస్తరించింది. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన వలస కార్మికులతో కుటుంబ సభ్యులకు, ఇతరులకూ సోకింది. గ్రేటర్ నుంచి రాకపోకలు పెరగడంతో మరికొన్ని కేసులు వచ్చాయి. ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి మారుమూల జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 11 జిల్లాల్లో పేషెంట్ల సంఖ్య 50 దాటింది. జనగాం, గద్వాల్, కరీంనగర్ జిల్లాల్లో 40కిపైగా కేసులు నమోదైనయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో(గ్రేటర్ మినహా) కలిపి 1050 కేసులు నమోదవగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో వందకు దగ్గరయ్యాయి. శుక్రవారం నాటికి నమోదైన 6,526 కేసుల్లో సుమారు 58 శాతం గ్రేటర్ హైదరాబాద్లో ఉండగా, 42 శాతం కేసులు జిల్లాల్లో ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో శనివారం ఒక్కరోజే 11 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల్లోనూ లింక్ దొరుక్తలేదు
మంచిర్యాల జిల్లాల్లో శుక్రవారం నాటికి 58 కేసులు నమోదైనయి. ఇందులో 9 మందికి వైరస్ ఎవరి ద్వారా సోకిందో తెలియలేదు. యాదాద్రి జిల్లాల్లో కేసుల సంఖ్య 54కు చేరింది. ఇక్కడ ఓ కూరగాయాల వ్యాపారికి వైరస్ పాజిటివ్ వచ్చింది. అయితే, ఆయనకు ఎవరి నుంచి అంటుకుందో ఇప్పటికీ తెల్వలె. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కేసుల సంఖ్య వంద దాటింది. ఒక్క అర్బన్ జిల్లాలోనే 50కిపైగా కేసులు నమోదైనయి. ఇక్కడ కూడా ఒకట్రెండు కేసుల్లో క్లియర్ లింక్ దొరకలె. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 80కిపైగా కేసులు నమోదైనయి. నిజామాబాద్లో మర్కజ్ లింక్తో ఎక్కువ కేసులు నమోదవగా, జగిత్యాలలో వలస కార్మికులతో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. గ్రేటర్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని చాలా కేసుల్లో వైరస్ లింక్ దొరకలేదు. హైదరాబాద్ నుంచి నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తుండడంతో ఇక్కడ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.
ఐసోలేషన్ భయం
జిల్లాల్లో కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళ న ఎక్కువైతోంది. వైరస్ సోకిన వ్యక్తులను లక్షణాలు లేవని చెప్పి, ఇంట్లోనే ఐసోలేట్ చేస్తుండడంతో ఈ ఆం దోళన మరింత పెరుగుతోంది. కొన్ని చోట్ల పాజిటివ్ వ్యక్తులను గ్రామాల్లో ఉంచడంపై జనాలు తిరగబడుతున్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం హోమ్ ఐసోలేషన్ అనేది పేషెంట్ ఇష్ట ప్రకారం జరగాలి. అలాగే, పేషెంట్ ఇంట్లో ఐసోలేషన్ ఉండే సౌలత్ ఉందో, లేదో డాక్టర్లు చెక్ చేయాలి. కానీ, ఇవేవీ చూడ కుండానే చాలా మందిని హోమ్ ఐసోలేట్ చేస్తున్నా రు. ఇలా చేయడం వల్ల బాధితుల ఇంట్లో వాళ్లు హడ లెత్తిపోతున్నారు. సొంత వాళ్లను కాదనుకోలేక, వాళ్ల తో కలిసి ఉండలేక కుంగిపోతున్నారు. జిల్లాల్లోనూ వందల సంఖ్యలో బెడ్లతో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పా టు చేసినట్టు సర్కారు చెబుతోంది. బాధితులను ఈ సెంటర్లకు తరలించాలని జనాలు కోరుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి