ఇండియన్ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ లో ఎన్టీపీసీ యువకుడికి 78వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌..

ఇండియన్ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ లో  ఎన్టీపీసీ యువకుడికి 78వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌..

జ్యోతినగర్,వెలుగు: ఇటీవల విడుదలైన యూపీఎస్‌‌‌‌‌‌‌‌సీ ఫలితాల్లో ఎన్టీపీసీ యువకుడు సత్తాచాటాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఏరియాకు చెందిన దహగామ శశాంక్ ఇండియన్ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో 78వ ర్యాంక్, స్టేట్​లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. శశాంక్‌‌‌‌‌‌‌‌ జేఎన్టీయూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌‌‌‌‌‌‌‌లో ఎంటెక్ పూర్తి చేశాడు.

2024 లా సెట్ లో 32వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఓయూలో ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీ చదువుతున్నాడు. ఐఏఎస్​ లక్ష్యంగా ప్రిపేర్ అయిన అతను.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్​ సాధించాడు. తండ్రి  ఉమామహేశ్వర్, పర్యావరణ వేత్త, తల్లి నాగలక్ష్మి అడ్వకేట్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు.