
పద్మారావునగర్, వెలుగు: ఎన్టీపీసీ సౌత్ రీజియన్హెడ్ క్వార్టర్ ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛతాహీ సేవా నిర్వహించారు. సికింద్రాబాద్ఎన్టీపీసీ ఆఫీస్నుంచి గాంధీ ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ తీశారు.
గాంధీ ఆసుపత్రి ఆవరణలో శ్రమదానం చేశారు. ఎన్టీపీసీ తరపున గాంధీ ఆసుపత్రికి డస్ట్ బిన్లు అందచేశారు. ఎన్టీపీసీ జీఎం ఎస్.ఎన్.పాణిగ్రాహి, రోహిత్చాబ్రా, సురేశ్,వెంకటేశ్, డీఎంఈ డా.ఎన్.వాణి, గాంధీ సూపరింటెండెంట్ప్రొ.రాజకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్డాక్టర్ జీకే సునీల్ పాల్గొన్నారు.