ఎన్టీఆర్ మెచ్చిన సింగ్ గీతం.. హృదయాన్ని తాకే సినిమా అంటూ కితాబు

ఎన్టీఆర్ మెచ్చిన సింగ్ గీతం.. హృదయాన్ని తాకే సినిమా అంటూ కితాబు

సింగీతం శ్రీనివాసరావు  తెరకెక్కించిన చిత్రం ‘సింగ్‌‌‌‌ గీతం’.  జూన్ 12న  విడుదలైన ఈ చిత్రంపై  సగటు ప్రేక్షకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్‌‌‌‌గా నిర్వహించిన సక్సెస్ మీట్‌‌‌‌లో అనిల్ రావిపూడి పాల్గొని.. సింగీతం గారి నుంచి వచ్చిన మరో ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పాడు.  

ఈ చిత్రాన్ని చూసిన  హీరో ఎన్టీఆర్..  ‘సింగ్ గీతం’  హృదయాన్ని తాకే అద్భుతమైన సినిమా అని,  తరతరాల సినీ అభిమానులకు సింగీతం గారు  ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ట్వీట్ చేశాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఈ చిత్రాన్ని నిర్మించిన  నాగ్ అశ్విన్..  ప్రేక్షకుల రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉందన్నాడు. 

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటులు రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్,  అహల్య, అయాన్,  శాలిని,  బెనర్జీ,  శివన్నారాయణ పాల్గొని ఈ సక్సెస్‌‌‌‌లో భాగమవడం ఆనందంగా ఉందన్నారు.