పద్మారావునగర్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ నర్సులు 17 రోజులుగా చేస్తున్న సమ్మెను మంగళవారం విరమించారు. బుధవారం నుంచి విధులకు హాజరవుతామని నర్సులు తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్అమలులో ఉన్నందున సమ్మె విరమిస్తామని, డ్యూటీలు చేస్తూనే వివిధ రూపాల్లో తమ జీతాలు పెరిగే వరకు నిరసనలు చేస్తామని నర్సులు పేర్కొన్నారు.
మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆస్పత్రి సూపరింటెండెంట్తో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహా, కార్యదర్శి ప్రసాద్చర్చలు జరిపారు. ఎన్నికల కోడ్ కారణంగా సమ్మెను విరమిస్తున్నట్లు ఏఐటీయూసీ నేతలు ప్రకటించారు. తమ సమస్యలపై నర్సుల యూనియన్ నేతలు ఇందిరా, సబిత, సుందరమ్మ, నాగమణి.. అధికారులకు వినతిపత్రం అందించారు.