ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే

ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే

ఎన్టీఆర్ జనం నాడి తెలిసిన గొప్ప వ్యక్తి అని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. రిటైర్  అయ్యాక ఎన్టీఆర్  పై పుస్తకం రాస్తానన్నారు. తిరుపతి  ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేని, ఆయన సమగ్ర సమతామూర్తి అని కొనియాడారు. రైతుబిడ్డగా, రంగస్థల నటుడిగా, కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగారన్నారు ఎన్వీ రమణ.