- బంద్ అయిన 32 సీసీ కెమెరాలు
- ఆలయ సిబ్బంది పనే అని అనుమానం
కొయురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలోని సీసీ కెమెరాలకు సంబంధించిన ఎన్ వీఆర్(నెట్వర్క్వీడియో రికార్డర్) సిస్టమ్ ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆలయంలోని 32 సీసీ కెమెరాలు బంద్అయ్యాయి. ఆలయ పరిధిలో ఏం జరుగుతుందో పర్యవేక్షించే అవకాశం లేకుండాపోయింది. మంగళవారం పరిశీలించిన టెక్నీషియన్.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఎన్వీఆర్ను ధ్వంసం చేశారని చెప్పాడు.
ఆలయ సిబ్బంది పనే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వారం కింద ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాన్ని తప్పుబడుతూ స్థానిక యువకులు ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజీని చెక్చేద్దామని మంగళవారం ఆలయ చైర్మన్ భిక్షపతి ఎన్వీఆర్ను పరిశీలించగా, ధ్వంసమైన విషయం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చైర్మన్తెలిపారు.