కొమురవెల్లి మల్లన్న గుడిలోని.. ఎన్​వీఆర్ ​సిస్టమ్ ​ధ్వంసం

కొమురవెల్లి మల్లన్న గుడిలోని.. ఎన్​వీఆర్ ​సిస్టమ్ ​ధ్వంసం
  • బంద్ ​అయిన 32 సీసీ కెమెరాలు
  • ఆలయ సిబ్బంది పనే అని అనుమానం

కొయురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలోని సీసీ కెమెరాలకు సంబంధించిన ఎన్ వీఆర్(నెట్​వర్క్​వీడియో రికార్డర్) సిస్టమ్ ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆలయంలోని 32 సీసీ కెమెరాలు బంద్​అయ్యాయి. ఆలయ పరిధిలో ఏం జరుగుతుందో పర్యవేక్షించే అవకాశం లేకుండాపోయింది. మంగళవారం పరిశీలించిన టెక్నీషియన్.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఎన్​వీఆర్​ను ధ్వంసం చేశారని చెప్పాడు.

ఆలయ సిబ్బంది పనే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వారం కింద ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాన్ని తప్పుబడుతూ స్థానిక యువకులు ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజీని చెక్​చేద్దామని మంగళవారం ఆలయ చైర్మన్ భిక్షపతి ఎన్​వీఆర్​ను పరిశీలించగా, ధ్వంసమైన విషయం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చైర్మన్​తెలిపారు.