
బషీర్ బాగ్, వెలుగు: లిక్కర్ స్కాంలో అరెస్ట్అయ్యి, ఇటీవల బెయిల్పై బయటికి వచ్చిన ఎమ్మెల్సీ కవితపై కొందరు సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని బీఆర్ఎస్వీ నాయకులు సైబర్క్రైమ్పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం బషీర్ బాగ్ లోని సీసీఎస్ ఆఫీసులో డీసీపీని కలిసి ఫిర్యాదును అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అఫిషియల్అకౌంట్లతోపాటు, ఆ పార్టీ నాయకులు తమ సోషల్అకౌంట్లలో కవితపై దూషణకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కవిత ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని తెలిపారు. సదరు అకౌంట్లను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.