విపక్షాలకు షాక్.. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న బీజేడీ

విపక్షాలకు షాక్.. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న బీజేడీ

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు, డీఎంకే, టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ప్రారంభోత్సవానికి రామని చెప్పాయి. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. అయితే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని కొత్త భవనాన్ని ప్రారంభించం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం (మే 28న) రోజున కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని జిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ఒడిశా ముఖ్యమంత్రి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ ఒకటి. ఇప్పటికే అకాలీదళ్ పార్టీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపింది. 

కొత్త పార్లమెంట్ భవనం లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది వరకు సౌకర్యవంతంగా కూర్చునేలా నిర్మించారు. ఉభయసభల్లో మొత్తంగా 1280 మంది సభ్యులు కూర్చునేందుకు అనువుగా భవనాన్ని నిర్మించారు. ప్రధాని మోడీ దీనికి డిసెంబర్ 2020లో శంకుస్థాపన చేశారు. మే 28న ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు.