
హైదరాబాద్, వెలుగు: సిటీలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు ఏం చేయాలనే దానిపై సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బల్దియా, పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అనంతరం పలు ప్రాంతాల్లోకి వెళ్లి ఫీల్డ్ విజిట్ చేశారు. ట్రాఫిక్ ఫ్రీ మూవ్మెంట్, రోడ్ వైడెనింగ్కు అవకాశం లేని చోట్ల ఇతర మార్గాలపై చర్చించారు. అవసరమైన చోట బ్రిడ్జిల నిర్మాణాలపై అధ్యయనం చేశారు. ఫీల్డ్ విజిట్లో బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సీపీ రంగనాథ్, జీహెచ్ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.