జగిత్యాల జిల్లాలో 4,700 ఎకరాల్లో ఆయిల్‌‌పామ్‌‌

జగిత్యాల జిల్లాలో 4,700 ఎకరాల్లో ఆయిల్‌‌పామ్‌‌

రాయికల్​, వెలుగు: జగిత్యాల జిల్లాలో 4,700 ఎకరాల్లో రైతులు ఆయిల్‌‌పామ్‌‌ సాగుచేస్తున్నారని హార్టికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ శ్యాంప్రసాద్​ తెలిపారు. ఉద్యాన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో  2025– -26కిగానూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలో శుక్రవారం ఓ రైతు పొలంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఆయిల్‌‌పామ్‌‌ మొక్క నాటిన 3 ఏండ్ల తర్వాత ప్రారంభమై 30 ఏండ్ల వరకు దిగుబడి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో డివిజనల్‌‌ ఆఫీసర్‌‌‌‌ స్వాతి, లోహియా జిల్లా మేనేజర్ విజయ్ భరత్,  క్షేత్ర సిబ్బంది రాజేశ్‌‌, కుమార్‌‌‌‌, డ్రిప్ కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.